ఉదయగిరి మండలం గండిపాలెం ప్రాజెక్ట్ వద్ద వేంచేసియున్న *శ్రీ అభయాంజనేయ స్వామి * వారి దేవస్థానం నందు రేపు రథసప్తమి సందర్భంగా ఉదయం 6. 30 గంటలకు శ్రీ అభయాంజనేయ స్వామివారికి విశేష అభిషేకములు, ఆకుపూజ కార్యక్రమం జరుగును. కావున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు లోకా. వెంకటప్రసాద్ శర్మ, లోకా మురళీధర్ శర్మ సోమవారం ఒక ప్రకటన ద్వారా కోరారు.