వరికుంటపాడు మండలం సాతువారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారామ, లక్ష్మణ, హనుమంతు సమేత విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు అందజేశారు. యాగశాలలోని నవగ్రహ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ సీతారాముల స్వామివారి కృపకు పాత్రులయ్యారు.