దుత్తలూరు మండలంలోని మాజారా ఉలవవారిపాలెం గ్రామంలో గత కొన్ని రోజులుగా వీధి లైట్లు పనిచేయడం లేదని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ వీధుల్లో చీకటి నెలకొనడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. రాత్రి పూట విష సర్పాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి ఇప్పటికైనా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.