వింజమూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నల్లగొండ్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మాజీ ఆలయ చైర్మన్ లెక్కల చిన కొండారెడ్డి ఆహ్వానించారు. శుక్రవారం వింజమూరు టీడీపీ కార్యాలయంలో అంకినపల్లి ఓబుల్ రెడ్డి, నరసింహారెడ్డి మరియు గ్రామ నాయకులతో కలిసి చిన కొండారెడ్డి ఎమ్మెల్యే ని ఆహ్వానించారు. ఈనెల 9వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు.