వింజమూరు పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో వేంచేసియున్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అష్టమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహిస్తున్న అభిషేక కార్యక్రమాలలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్లకి పురోహితులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆశీర్వాదాలు అందించారు.