వింజమూరు పట్టణం (మేజర్ పంచాయతీ) కార్యదర్శి శివకుమార్ సస్పెండ్ అయ్యారు. గతంలో కోవూరులో పనిచేసిన ఆయన అక్కడ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. నిధులు దుర్వినియోగం జరగడం వాస్తవం అని తేల్చిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు గురువారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇటీవల కాలంలోనే ఆయన వింజమూరుకు బదిలీ అయ్యి వచ్చారు.