సొంత నిధులతో అన్న క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీరుస్తున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గములోని వింజమూరు మండల కేంద్రములో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పేద ప్రజల ఆకలిని తీరుస్తుంది. బుధవారం (414వ రోజు) అన్న క్యాంటీన్ ద్వారా 448 మంది పేద ప్రజలు తమ ఆకలిని తీర్చుకున్నారు.