వరికుంటపాడు మండలంలో అనాదిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న విరువూరు పీర్ల పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. పీర్ల చావిడిని అలంకరించి పీర్లను ఎంతో పరమనిష్టగా భావించి పెద్దలు చావిడిలో ఉంచారు. గురువారం రాత్రి చిన్న పీర్ల సర్గస్ నిర్వహించారు. మాజీ సర్పంచ్ మూలెం వెంకటసుబ్బారెడ్డి తో పాటు మూలెం రామ్మోహన్ రెడ్డి, గడ్డం తిరుపతి రెడ్డి వారి వంశస్థులు ఈ పీర్ల పండుగ నిర్వహణలో పాలు పంచుకున్నారు.