ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో జరుగుతున్న శ్రీమానసాదేవి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం పాల్గొన్నారు. గ్రామస్తులు కాకర్ల సురేష్ కు గ్రామంలో ఉన్న వివిధ రకాల సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన కాకర్ల సురేష్ సమస్యలు పరిష్కరిస్తానన్నారు. అలాగే శ్రీ మానసా దేవి ఆలయ అభివృద్ధికి తనవంతుగా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.