కండలేరు జలాశయంలో చేపల వేట నిషేధం

58చూసినవారు
కండలేరు జలాశయంలో చేపల వేట నిషేధం
రాపూరు మండలం లోని కండలేరు జలాశయంలో జూలై 1వ తేదీ నుంచి చేపల వేటను నిషేధిస్తున్నామని మత్స్యశాఖ సహాయ పరిశీలకులు కె. సురేష్ బాబు శనివారం తెలిపారు. అలాగే ఆగస్టు 31వ తేదీ వరకు నిషేధం కొనసాగుతుందని చెప్పారు. ఈ రెండు నెలల సమయంలో తల్లి చేప గుడ్లు పెడుతుందని తెలిపారు. చేపల ఉత్పత్తి పెరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అతిక్రమించి ఎవరైనా చేపలు వేట చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్