గ్రామాభివృద్ధే ధ్యేయంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు పని చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశoలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లల్లో అభివృద్ధి ఏ పాటి జరిగిందో గ్రామాల్లో పర్యటిస్తుంటే తెలుస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పనుల్లో అధికారులు కూడా మౌనం పాటించారని కూటమి ప్రభుత్వ హయాంలో ఇలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.