వైసీపీకి కొత్త భయం.. సామూహిక అనర్హత వేటు?

85చూసినవారు
వైసీపీకి కొత్త భయం.. సామూహిక అనర్హత వేటు?
వరుసగా అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న హెచ్చరికలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. జగన్ ను టార్గెట్‌గా చేసుకుని రఘురామ ఈ వ్యాఖ్యలు చేసినా, అసెంబ్లీకి రాని మిగతా 10 మంది ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడటం ఖాయమని రాజ‌కీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వరుసగా 60 రోజులు సభకు డుమ్మా కొట్టే ఏ ఎమ్మెల్యేలపైన అయిన‌ అనర్హత వేటు వేయొచ్చని డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇటీవల ప్రకటించిన విష‌యం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్