AP: రాష్ట్ర ప్రజలకు కేంద్రం మరో గుడ్న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా ప్రకటించారు. దీంతో అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం– అబుదాబి మధ్య జూన్ 13 నుంచి ఈ సర్వీసుల ప్రారంభమవుతాయని, ఇవి వారానికి నాలుగు రోజులు నడుస్తాయని ఆయన వెల్లడించారు.