‘మేకిన్ ఇండియా’పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి చేసిన విమర్శలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు.'మేకిన్ ఇండియా' విఫలమైందని, ఉత్పత్తి రంగంలో భారత్ నిలదొక్కుకోకపోవడం వల్ల చైనా ఇక్కడ మకాం వేసిందంటూ లోక్సభలో రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. సోమవారం వీటిని నిర్మలా సీతారామన్ ఖండించారు. 2008లో చైనాతో కాంగ్రెస్ ఓ ఒప్పందం కుదుర్చుకుందని, దాని వివరాలు బహిర్గతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.