విశాఖ జోన్‌కు భూమి ఇవ్వలేదు: రైల్వే మంత్రి

76చూసినవారు
విశాఖ జోన్‌కు భూమి ఇవ్వలేదు: రైల్వే మంత్రి
విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధమైందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్ల‌డించారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఏపీ స‌ర్కార్‌ను కోరామ‌ని, అయితే ప్రభుత్వం ఇంకా భూమి అప్పగించలేదని తెలిపారు. భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నమని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్