AP: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని తేలడంతో కూటమి ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణలో 2019-24 జగన్ హయాంలో రాష్ట్రంలో మద్యం స్కాం జరిగినట్లు గుర్తించింది. ఇందులో భాగంగా ఇప్పటికే కసిరెడ్డికి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సైతం నోటీసులు ఇచ్చింది. తాజాగా YCP ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న విచారణ రావాలని నోటిసుల్లో పేర్కొన్నారు.