వైసీపీ నేతలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసు స్టేషన్కు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వీరిపై గతంలో కేసు నమోదైంది. అనంతరం వారు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో 41 ఏ నోటీసులు ఇచ్చి మధ్యాహ్నం విచారణకు రావాలని పోలీసులు తెలిపారు.