యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్–2, డ్రాగన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా దాదా సాహెబ్ అంబేద్కర్ బయోపిక్లో నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో డైరెక్టర్ నితిన్ కక్కర్ తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. కొన్ని కారణాలతో వాయిదా పడగా.. ఇప్పుడు మళ్లీ దీనికి సంబంధించిన ఎన్టీఆర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.