మైలవరం మండలం మర్సుమల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మోతళ్ల వెంకట సుబ్బారావు (పెదబాబు)తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆయనకు డిజిటల్ రూపంలో శాశ్వత సభ్యత్వం రశీదును ఇబ్రహీంపట్నంలో మంగళవారం అందజేశారు. మైలవరం నియోజకవర్గంలో 11 మంది శాశ్వత సభ్యత్వములు నమోదు చేసుకున్నారు. శాశ్వత సభ్యత్వములు కూడా తీసుకోవాలని పార్టీ కుటుంబ సభ్యులకు సూచించారు.