నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చంద్ర బాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 12వ తేదీన తిరువూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. విస్సన్నపేట మండలం కొండపర్వ, ఏ కొండూరు మండలం కుమ్మరి కుంట్ల, పోలిశెట్టిపాడు, తిరువూరు మండలం కాకర్ల, 13న పట్టణంలోని 13వ వార్డులో పర్యటించనున్నట్లుగా వర్గాలు తెలిపాయి. పట్నం లో బహిరంగ సభతో పర్యటన ముగుస్తుందని తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లుగా బుధవారం తెలిపారు.