తిరువూరు నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం మండల ఎమ్మార్వోగా శుక్రవారం వి. రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎన్టీఆర్ జిల్లాలోనే పనిచేస్తూ, ఎమ్మార్వో ఎన్నికల విధుల్లో భాగంగా కాకినాడ జిల్లా బదిలీ అయ్యారు. తాజాగా బదిలీల్లో రాజకుమారి గంపలగూడెం ఎమ్మార్వో గా జిల్లా ఉన్నతాధికారులు బదిలీ చేశారు. మండల రెవెన్యూ అధికారులు సిబ్బంది రాజకుమారికి అభినందనలు తెలిపారు.