ఏపీలో 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా ఉన్నట్లు ప్రభుత్వ స్క్రీనింగ్ పరీక్షల్లో తేలింది. ఇప్పటివరకు 53.07 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 52,221 మంది క్యాన్సర్ అనుమానితులు ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అనుమానితులే అధికంగా ఉన్నట్లు పేర్కొంది.