ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత దళాల చర్యపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ను 2011లో అమెరికా ఉగ్రవాది బిన్ లాడెన్ను 'ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్' ద్వారా హతమార్చిన సంఘటనతో పోల్చుతూ, భారత్ పాక్లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాదులను నిశ్శబ్దంగా మట్టుబెట్టిందని తెలిపారు.