టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మపై పాక్ క్రికెటర్ బసిత్ అలీ ప్రశంసలు కురిపించారు. ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో వన్డేలో అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో అభిషేక్ ఆటకు అభిమానులే కాదు ఆటగాళ్లు కూడా ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో తాజాగా అభిషేక్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు.