అద్దంకి పట్టణంలోని శివారు ప్రాంతాలలో శుక్రవారం బహిరంగ ప్రదేశంలో మందు తాగుతున్న వారికి ఎస్సై ఖాదర్ బాషా కౌన్సిలింగ్ ఇచ్చారు. చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. బహిరంగంగా మద్యం తాగడం నేరమని పేర్కొన్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేశారు.