ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలని బాపట్ల పట్టణ ఎస్సై విజయకుమార్ సూచించారు. శుక్రవారం బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో వాహనాలు తనిఖీ చేశారు. ప్రధానంగా ఆటో డ్రైవర్లు యూనిఫారం ధరించడంతోపాటు డిజె సౌండ్ సిస్టం పెట్టరాదని ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.