బాపట్ల డిపో పరిధిలో కొత్త రూట్లలో బస్సుల ఏర్పాటుకు కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ని బుధవారం బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సచివాలయంలో మంత్రి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి కోరారు.
2022లో బాపట్ల జిల్లా కేంద్రంగా మారిందని ప్రజల నుంచి డిమాండ్ పెరిగినప్పటికీ కొత్తగా బస్సులు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. స్పందించిన మంత్రి త్వరలో ప్రతిపాదన చేసి ఏర్పాటు చేస్తామని తెలిపారు.