ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జూన్ 5న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశానికి అందరూ హాజరు కావాలని బాపట్ల జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే రోశయ్య పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో ఆయన బ్యానర్ ను ఆవిష్కరించారు. 12వ పిఆర్సి కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, మధ్యంతర భృతిని, పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, 143 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.