గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 13, 14, 15వ తేదీల్లో తెలుగు సంప్రదాయాలను నేటి తరానికి తెలియచేసేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లపై కమిషనర్ శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.