సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురవయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రవీంద్ర నగర్, శాలీనగర్ సబ్ స్టేషన్స్ మరమ్మతులు నేపథ్యంలో పట్టాభిపురం, శాలీనగర్, స్తంభాలగరువు, రవీంద్ర నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.