అంటు వ్యాధులు రాకుండా ఘన వ్యర్ధాల నిర్వహణ కార్యక్రమం

80చూసినవారు
అంటు వ్యాధులు రాకుండా ఘన వ్యర్ధాల నిర్వహణ కార్యక్రమం
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఐటిసి సెర్చ్ ఆధ్వర్యంలో ఘన వ్యర్ధాల నిర్వహణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ మాడబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ, ఈ శీతాకాల సమయంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఘన వ్యర్థాలను సరైన పద్ధతిలో ప్రాసెస్ చేయడం వలన అంటు వ్యాధులు నివారించవచ్చని, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు.

సంబంధిత పోస్ట్