రాష్ట్ర పద్మశాలీయ సాధికార సమితి మీడియా కోఆర్డినేటర్ తిరువీధుల బాపనయ్య మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు శనివారం మంగళగిరిలో ఓ ప్రకటన విడుదల చేశారు. బాపనయ్య మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. పార్టీ పటిష్టత కోసం బాపనయ్య కృషిచేశారని, వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.