మంగళగిరి: డ్రోన్లతో సరికొత్త సేవలు

81చూసినవారు
మంగళగిరి: డ్రోన్లతో సరికొత్త సేవలు
మంగళగిరిలో డ్రోన్లతో సరికొత్త సేవలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. యూపీహెచ్ సీ ఇందిరా నగర్ నుంచి ఎయిమ్స్ గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం పిఏపి స్మెర్ నమూనాలను డ్రోన్ సహాయంతో 2 నిమిషాల్లో పంపించారు. వైద్య రంగంలో ఏపీ మరో మైలురాయిని అధిగమించిందని ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. డ్రోన్ సేవల పైలట్ ప్రాజెక్ట్ ను ఆయన ప్రారంభించారు. ఎయిమ్స్ సిబ్బందిని, అధికారులను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్