తాడేపల్లి మండలం సీతానగరం, మహానాడులో శుక్రవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవి కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ కళ్యాణ్ రాజు 80 మంది సిబ్బందితో సోదాలు చేశారు. సీతానగరం ఘాట్లు, మహానాడు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేని 19 బైకులు సీజ్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు.