ప్రజల కోసం నిత్యం తప్పించే వారిని గెలిపించుకున్నపుడే ప్రజలకు అసలైన మేలు జరుగుతుందని ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్ధి చదలవాడ అరవింద బాబు కుమార్తె అమూల్య పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణంలో 24వ వార్డులో శనివారం ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్లుగా నాన్నని చూస్తున్నా. ప్రజల కోసం ఆలోచించని రోజు లేదు, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే తపన చూసి ఆశ్చర్యం కలుగుతోంది.