మార్టూరులోని క్యాంపు కార్యాలయం నందు పర్చూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయా సమస్యలపై అర్జీలను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అందజేశారు. సమస్యలపై వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు బదలాయించారు. వెంటనే పరిష్కరించాలని సూచించారు.