పొన్నూరులో తల్లిపాల వారోత్సవాల ర్యాలీ ప్రదర్శన

67చూసినవారు
పొన్నూరు ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద గురువారం తల్లిపాల వారోత్సవాల ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై. అలేఖ్య పాల్గొని మాట్లాడుతూ బిడ్డ పుట్టగానే ముర్రు పాలు తాగించాలని సూచించారు. బిడ్డ శారీరక మానసిక ఎదుగుదల పెరిగి ఆరోగ్యవంతంగా జీవిస్తారని పేర్కొన్నారు. తల్లిపాలు న్యూమోనియా, అతిసారా వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని పేర్కొన్నారు. వారోత్సవాల ప్రాధాన్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్