కేరళ రాష్ట్రం వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి వందలాదిమంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంతాపంగా పొన్నూరు పట్టణంలోని సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు బుధవారం పట్టణంలో ప్లకార్డులు చేత బుని సంతాప ర్యాలీ ప్రదర్శించారు. మృతుల కుటుంబాలకు తమ సానుభూతి తెలిపి యావత్తు దేశ వారికి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. సెయింట్ థామస్ పాఠశాల యాజమాన్యం, సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.