నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హెచ్చరించారు.
కాకుమాను మండల కేంద్రంలో బుధవారం అధికారుల సమీక్ష సమావేశంలో అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని ప్రజలకు మేలు చేసే విధంగా అధికారులు నడుచుకోవాలని పేర్కొన్నారు. మండలంలోని ప్రాధాన్యత సమస్యలను అధికారులు సమన్వయంతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.