నగరం మండలం ధూళిపూడి గ్రామంలో ఈనెల 11వ తేదీన జరిగే శ్రీ తాళమ్మ తల్లి వీరమ్మ పేరంటాల తిరునాళ్ల మహోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు రేపల్లె డీఎస్పీ ఆవల శ్రీనివాసరావు తెలిపారు. శనివారం తిరునాళ్ల జరిగే ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్నతో కలిసి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.