సత్తెనపల్లి తహసీల్దార్ గా కె. ఎస్. చక్రవర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పిడుగురాళ్ల తహశీల్దార్ గా పనిచేస్తున్న చక్రవర్తి సత్తెనపల్లి తహశీల్దార్ గా నియమితులయ్యారు. విధుల్లో చేరేందుకు వచ్చిన చక్రవర్తికి కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందచేసి స్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా శక్తి వంచన లేకుండా అందరికీ పారదర్శకంగా విధులు నిర్వహిస్తానని అన్నారు.