ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తాడికొండ సీఐ వాసు కోరారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాడికొండ మండల వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం వంటివి చేస్తే వాహనదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.