వైసిపిలో పదవులు పొందిన నాయకులు పార్టీ పటిష్టత కోసం పని చేయాలని వేమూరు నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్ వరికూటి అశోక్ బాబు సూచించారు, వైసిపి బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన కోగంటి లవ కుమార్, వైసీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు శనివారం వరికుటి అశోక్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో పదవి కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు, పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అశోక్ బాబు సూచించారు.