వినుకొండ పట్టణంలో అమ్మవారికి మహిళలు శుక్రవారం భోనాలు సమర్పించారు. పట్టణంలోని పోలేరమ్మ ఆలయంలో ఆషాడ మాసం సందర్భంగా మహిళలు ఆలయానికి భారీగా చేరుకున్నారు. ముందుగా మహిళలు పొంగళ్ళు వండి తలపై పెట్టుకుని అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళాలు పాల్గొన్నారు.