నూజండ్ల మండలం ఐనఓలు పోలీస్ స్టేషన్ను బుధవారం పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం స్టేషన్లోని రికార్డులు, పోలిస్ స్టేషన్లోని మహిళా సహయ కేంద్రంను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, వినుకొండ రూరల్ సీఐ ప్రభాకర్, ఐనఓలు ఎస్ఐ కృష్ణారావు పాల్గొన్నారు.