విద్యుత్ లైన్ల మరమ్మత్తుల నేపథ్యంలో శనివారం ఉదయం 10. 00 గంటల నుంచి మధ్యాహ్నం 2. 00 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు గుంటూరు టౌన్-2 డీఈఈ గురవయ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుజ్జనగుండ్ల, ఎస్వీఎన్ కాలనీ, నేతాజీ నగర్, తారకరామ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. వినియోగదారులు గమనించాలని కోరారు.