ఇటీవల బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగానే కాకుండా రాజకీయంగానూ బాలకృష్ణ ప్రజలకు ఎన్నో సేవలు చేశారని తెలిపారు. 50 ఏళ్ల నుంచి సినిమా రంగంలో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆలరిస్తున్నారంటూ బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు.