బొబ్బిలి మండలం మెట్టవలస వీఆర్వో అడపా గౌరీశంకర్ కు అట్రాసి టీ కేసు నమోదు చేసినట్టు సీఐ సతీష్ కుమార్ తెలిపారు. పారాది గ్రామానికి చెందిన నగర పోలమ్మ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. పట్టాదారు పుస్తకాల కోసం అడిగితే వీఆర్వో తనను కులం పేరుతో దూషించాడని ఆమె ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీనిపై డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహిస్తున్నామని సీఐ తెలిపారు.