పూలంగి సేవకు భక్తులు తరలిరావాలని అనువంశిక ధర్మకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కేకే రంగారావు(బేబీ నాయన)కోరారు. ధనుర్మాస సందర్భంగా సోమవారం(రేపు ) బొబ్బిలి పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూలంగి సేవ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 9 గంటల నుండి దర్శనాలు ప్రారంభం జరుగుతాయి అన్నారు. అదేవిధంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 50 రకాల పువ్వులతో పుష్పయాగం నిర్వహిస్తారు అన్నారు.