బొబ్బిలి: విద్యుత్ రాగి వైర్ల చోరీ ముఠా పట్టివేత

68చూసినవారు
బొబ్బిలి: విద్యుత్ రాగి వైర్ల చోరీ ముఠా పట్టివేత
కొంతకాలంగా రామద్రపురం మండలం ఆరికతోట, కొట్టక్కి, నాయుడువలస ప్రాంతాలలో రోడ్డు పక్కన ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న రాగి వైర్లను దొంగతనాలకు పాల్పడిన ముఠా పోలీసులకు చిక్కారు. గురువారం బొబ్బిలి డీఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సై ప్రసాదు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీల్లో భాగంగా ఆరికతోట జంక్షన్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న బొలోరా వ్యాన్ ను తనిఖీ చేయగా రాగి వైర్లు బస్తాలలో పట్టుబడ్డాయన్నారు.

సంబంధిత పోస్ట్